మేడ్చల్ లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్

మేడ్చల్ లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్

మేడ్చల్ PS పరిధిలో రేకులబావి చౌరస్తా దగ్గర గంజాయి పట్టుకున్నారు  SOT పోలీసులు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకొని.. బ్యాగులు పరిశీలించారు. నిందితుల దగ్గర నుంచి 20 వేల విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నౌపాడా ప్రాంతానికి చెందిన గిర్ధారి నుంచి 2 కేజీల గంజాయిని 2 వేల 5వందల చొప్పున కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు.

 లాల్ బజార్ కు చెందిన రోహిత్ అనే వ్యక్తికి కేజీ 10 వేలకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఫోన్ పే తో అడ్వాన్స్  తీసుకున్నారు. గంజాయి ఇచ్చేందుకు వచ్చిన టైంలో నిందితులు పట్టుపడ్డారు.