ద్రౌపది ముర్ముకు మద్దతుపై త్వరలో శివసేన క్లారిటీ

ద్రౌపది ముర్ముకు మద్దతుపై త్వరలో శివసేన క్లారిటీ

ఉద్దవ్ థాక్రే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ముకు మద్దతు తెలపాలని నిర్ణయించారు. నిన్న పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. 19 మంది ఎంపీల్లో 16 మంది ఉద్దవ్ థాక్రే సమావేశానికి హాజరయ్యారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించాలని సంజయ్ రౌత్ సూచించినట్లు తెలిసింది. అయితే మిగతా ఎంపీలు ముర్ముకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో థాక్రే నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే శివసేన ఎప్పుడూ ఒత్తిడికి లొగదన్నారు ఎంపీ సంజయ్ రౌత్.. ద్రౌపది ముర్ముకు మద్దతిస్తే.. బీజేపీకి ఇచ్చినట్లు కాదన్నారు. గతంలో  ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతిచ్చామన్నారు. యశ్వంత్ సిన్హాపై తమకు మంచి అభిప్రాయమే ఉందని సంజయ్ రౌత్ తెలిపారు.