అంటరాని తనం పోవాలనే.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నా : ఉదయనిధి స్టాలిన్

అంటరాని తనం పోవాలనే.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నా : ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. దాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చిన ఉదయనిధి స్టాలిన్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటూనే.. మరోసారి తన వైఖరిని వెల్లడించి దేశవ్యాప్తంగా కలకలం రేపారు. మనుషుల మధ్య ఉన్న అంటరాని తనం నశించాలంటే.. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని.. అప్పుడే అంటరాని తనం పోతుందని స్పష్టం చేశారు తమిళనాడు మంత్రి ఉదయనిధి. సనాతన ధర్మం వల్లే అంటరాని తనం వచ్చిందని.. ఈ రెండు కవల పిల్లలు అని.. సమాజంలోని అంటరానితనం పోవాలంటే.. సనాతన ధర్మం ఉండకూడదని తన వైఖరి వెల్లడించారాయన.

కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను సమర్థిస్తూ తాజాగా మరో సారి తన పిలుపునిచ్చారు. సనాతన ధర్మం నిర్మూలన అయితే అంటరానితనాన్ని కూడా నాశనం అవుతుందని సమర్థించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికే తాను సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నానని, సనాతనాన్ని నాశనం చేస్తే అంటరానితనం కూడా నశించిపోతుందని తాను నమ్ముతున్నాను నొక్కి చెప్పారు.  

Also Read :- తిరుమల ట్రాప్ బోనులో చిక్కిన మరో చిరుత

అంతకుముందు, సనాతన ధర్మాన్ని ఉదయనిధి స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా, కరోనావైరస్ వంటి వ్యాధులతో పోల్చారు. "కొన్ని విషయాలను వ్యతిరేకించలేము, వాటిని అసహ్యించుకోవాలి అంతే. డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనాను మనం వ్యతిరేకించలేం, మనం వాటిని నిర్మూలించాలి. అంతే. మనం సనాతనాన్ని ఎలా నిర్మూలిస్తాము. సనాతనాన్ని వ్యతిరేకించే బదులు దానిని నిర్మూలించడం ఉత్తమం" అని చెప్పారు.