
ఈ మధ్య కాలంలో టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో కొంత మంది వాటిని దొంగతనం చేయడం, ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఓ దొంగ మాత్రం అంత కంటే భారీ స్కెచ్చే వేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల చాక్లెట్లు దొంగతనం చేసి.. చివరికి అరెస్టయ్యాడు. దీంతో అతనికి కోర్టు 18నెలల జైలు శిక్ష విధించింది.
యూకేలో జోబీ పూల్ అనే దొంగ 2 లక్షల క్యాడ్బరీ క్రీమ్ చాక్లెట్లు దొంగిలించాడు. వాటి విలువ రూ.42 లక్షలు ఉంటుందని సమాచారం. ఇది కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనే తాజాగా ఆ దొంగను నిర్ధారించడంతో విషయం మరోసారి వార్తల్లోకెక్కింది. ఫిబ్రవరి 11, 2023 లో ఒక చాక్లెట్ ఇండస్ట్రీ యూనిట్ నుంచి చాక్లెట్లు దొంగిలించిన జోబీ పూల్.. యూనిట్లోకి ప్రవేశించి చాలా చాకచక్యంగా చాక్లెట్లను దొంగిలించాడు. ఆ తర్వాత వాటిని లారీలో తీసుకెళ్లాడు.
ఆ తర్వాత విషయం పోలీసులకు తెలియడంతో.. లారీతో సహా అతడిని పట్టుకున్నారు. ష్రూస్ బరీ క్రౌన్ కోర్టులో న్యాయమూర్తి అంథోనీ లోవ్ 18నెలల శిక్ష విధించారు. ఇప్పటికే అతను 6 నెలలుగా కస్టడీలో ఉండగా.. మిగిలిన కాలం అతను జైలు జీవితం గడపాల్సి ఉంది.ఇదే విషయాన్ని తెలియజేస్తూ వెస్ట్ మెర్సియా పోలీసులు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
UPDATE | West Mercia Police has helped save Easter for Crème Egg fans after almost 200,000 of the chocolate treats were stolen from a unit in Stafford Park in Telford.
— West Mercia Police (@WMerciaPolice) February 13, 2023
1/3 pic.twitter.com/N2vr2iUbMo