యూకే ప్రధాన మహిళ అక్షతా మూర్తి సింప్లిసిటీ చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!

యూకే ప్రధాన మహిళ అక్షతా మూర్తి సింప్లిసిటీ చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!

హోదాలో ఒక యూకే ప్రధాని ఋషి సునక్ భార్య, స్వతహాగా ఇన్ఫోసిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ అధినేత నారాయణ మూర్తి కూతురు అయ్యుండి కూడా అక్షతా మూర్తి బెంగళూరు రోడ్లపై తన పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి సాదాసీదాగా తిరుగుతూ తన సింప్లిసిటీని చాటుకుంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బెంగళూరులోని రాఘవేంద్ర మఠంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తి, కూతురు అక్షతా మూర్తితో కలిసి ఎలాంటి సెక్యూరిటి లేకుండా బుక్ స్టాల్స్ వద్ద తిరుగుతూ కనిపించారు.

నారాయణ మూర్తి కుటుంబం తమ సింప్లిసిటీ చాటుకోవటం ఇది కొత్త కాదు, గతంలో కూడా నారాయణ మూర్తి, సుధామూర్తి సాదాసీదాగా బెంగళూరు రోడ్ల మీద తిరిగిన దాఖలాలు ఉన్నాయి. తాజగా రాఘవేంద్ర మఠంలో మూర్తి కుటుంబం సామాన్యుల్లా తిరుగుతున్న వీడియో ఓ నెటిజన్ ( ఎక్స్ ) ట్విట్టర్లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అయ్యింది. అంతటి స్థాయిలో ఉండి కూడా ఇంత సింపుల్ గా ఉండటం నారాయణ మూర్తి కుటుంబానికే చెందిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.