
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి ’. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వపడేలా చేసిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ సినిమా నిర్మాతలు, ఈ సినిమా దర్శకుడు కలిసి ఇప్పుడో సరికొత్త సినిమాతో వస్తున్నారు. అదే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ‘మహేశింతే ప్రతీకారమ్’ అనే మలయాళ చిత్రానికి ఇది రీమేక్. సత్యదేవ్, నరేష్, సుహాస్, రామ్ ప్రసాద్, కరుణాకరన్ తదితరులు నటించారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా వీడియో అనౌన్స్మెంట్ను బుధవారం విడుదలచేశారు. శోభు యార్లగడ్డ మాట్లా డుతూ ‘వెంకటేష్ మహా మన తెలుగునెటివిటీకి తగ్గట్టు సెన్సి బుల్గా సినిమాలు తీయగలడు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను స్టార్ట్ చేశాం’ అని చెప్పారు. ఈ సినిమాని అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే పూర్తి చేశాడు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి ఏప్రిల్ 17న సినిమాను విడుదల చేయనున్నా రు. మరి మొదటి చిత్రంతో శభాష్ అనిపించుకున్న దర్శకుడు రెండో సినిమాతో ఏ రేంజ్లో మెప్పిస్తా డో చూడాలి.
for more news