Hyderabad Metro Station : ప్యారడైజ్లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం.. ఏం చేశాడంటే..!

Hyderabad Metro Station : ప్యారడైజ్లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం.. ఏం చేశాడంటే..!

హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డ అతడిని  గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ ప్యారడైజ్​  మెట్రో స్టేషన్ పైనుంచి గుర్తుతెలియని  వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఇది గమనించిన  వారు  బేగంపేట పోలీసులకు తెలిపారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  దీనిపై కేసు నమోదు  పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. .అతడు మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.