 
                                    హైదరాబాద్లోని ఓ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డ అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఇది గమనించిన వారు బేగంపేట పోలీసులకు తెలిపారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. .అతడు మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.

 
         
                     
                     
                    