
కర్ణాటకలో విషాదం జరిగింది. బెంగళూరులోని, యశ్వంతపూర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి వచ్చిన అధికారులు సహాయచర్యలు చేపట్టారు. జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు.