ఏకంగా కోర్టు ప్రాగణంలోనే ట్రయల్ ఖైదీని దుండగుల కాల్చి చంపేశారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోల చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ శర్మ సోదరుడి హత్య కేసులో చోటే సర్కార్ అనే వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు.
Patna City SP Rajesh Kumar says, "Abhishek Kumar aka Chote Sarkar was attacked by two people who shot at him in Danapur court. Further investigation is underway. Abhishek Kumar passed away in the attack. Two accused taken into custody." pic.twitter.com/Feg73X4ZNg
— ANI (@ANI) December 15, 2023
ఈ కేసు విచారణ కోసం 2023 డిసెంబర్15 శుక్రవారం రోజునఅతడిని బేవుర్ జైలు నుంచి దనాపుర్ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. అయితే అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి సడన్ గా దూసుకొచ్చి చోటే సర్కార్పై పలుమార్లు కాల్పులు జరిపారు. దీంతో సర్కార్ అక్కడిక్కడే చనిపోయాడు.
ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.కాల్పుల ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. బహుశా వ్యక్తిగత కారణాలతోనే సర్కార్ ను దుండగలు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.