పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రపతి పాలనలోకి వెళ్లనుంది. ప్రెసిడెంట్ రూల్ విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్రానికి సిఫార్సు చేశారు. గవర్నర్ లెటర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్రం ఆమోదంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమలు కాబోతున్నదని తెలుస్తోంది. సీఎం వి.నారాయణ స్వామి రాజీనామాను మినిస్టర్ల కౌన్సిల్ యాక్సెప్ట్ చేసింది. రెండ్రోజుల కింద అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కాంగ్రెస్ బల నిరూపణ చేసుకోలేకపోడంతో ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.