టెంపర్ కోల్పోయి.. నిరసనకారులతో కేంద్ర మంత్రి వాగ్వాదం

టెంపర్ కోల్పోయి.. నిరసనకారులతో కేంద్ర మంత్రి వాగ్వాదం
  • ఆసుపత్రిలో వసతులు కల్పించాలంటూ నిరసనకారుల నినాదాలు
  • టెంపర్ కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి అశ్వినీ చౌబే

బక్సర్: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఇవాళ ఉదయం నిరసనకారులపై టెంపర్ కోల్పోయారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలకు కల్పించాలంటూ నిరసనకారులు నినాదాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లిపోండంటూ వారిపై వాగ్వాదానికి దిగారు. వారి చేతిలోని ప్లకార్డులను చించేశారు.

శుక్రవారం నాడు బిహార్‌లోని బక్సర్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ఉన్న గెస్ట్ హౌస్ ముందు కొంతమంది జనం గుమ్మిగూడి నిరసన తెలిపారు. బక్సర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అల్ట్రా సౌండ్ స్కాన్ 10 నెలల నుంచి పని చేయడం లేదని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి గతంలో చెప్పినా ఏ మార్పు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్లు నినాదాలు చేయడంతో ఆయన ఆవేశంగా అక్కడికి వచ్చారు. నిరసనకారుల చేతిలోని ప్లకార్డులు చించేశారు. అక్కడి నుంచి వెళ్లపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నిరసనకారుడితో పరస్పరం వాదనకు దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు కేందర మంత్రి.