
దేశంలో కరోనా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ… కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలను కోరారు. మధ్యప్రదేశ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్లో రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని చెప్పారు. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.82 శాతంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి స్థానిక నాయకులందరూ అవగాహన కల్పించాలని మంత్రి హర్షవర్ధన్ కోరారు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.