ఏం తింటున్నరు.. ఎంత తింటున్నరు?

ఏం తింటున్నరు.. ఎంత తింటున్నరు?

ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ రిపోర్టును విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్‌

దేశంలోని ఏయే ప్రాంతాల్లో ఏం తింటున్నరు, ఎంత తింటున్నరనే అంశంపై హైదరాబాద్‌‌‌‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్ న్యూట్రిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌) సైంటిస్టులు ఇచ్చిన రిపోర్టును హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ హర్షవర్దన్‌‌‌‌ విడుదల చేశారు. వయసు, బరువు, జెండర్, చేస్తున్న పని (ఫిజికల్ వర్క్‌‌‌‌) ఆధారంగా రోజుకు ఎంత ప్రొటీన్‌‌‌‌, విటమిన్, మినరల్స్‌‌‌‌ అవసరమవుతాయో సూచిస్తూ రూపొందించిన మరో రిపోర్టును కూడా హర్షవర్దన్ రిలీజ్‌‌‌‌ చేశారు. దాదాపు పదేండ్ల తర్వాత ఈ తరహా రిపోర్టును తయారు చేసినట్టు ఎన్‌‌‌‌ఐఎన్ సైంటిస్టులు వెల్లడించారు. ప్రస్తుత జీవన విధానం ఆధారంగా స్టడీ చేసి, ఎవరు ఎంత తింటే ఆరోగ్యంగా ఉంటారనే సైంటిఫిక్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌స్టాండింగ్‌‌‌‌కు వచ్చినట్టు పేర్కొన్నారు.