ఎంఎంటీఎస్ రైళ్లను స్టార్ట్ చేయండి

ఎంఎంటీఎస్ రైళ్లను స్టార్ట్ చేయండి

 సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్

హైదరాబాద్, వెలుగు : కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లను స్టార్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయమై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాలని సీఎం కేసీఆర్ కు సోమవారం లెటర్ రాశారు. ముంబైలో అక్కడి సర్కారు రిక్వెస్ట్​ మేరకు లోకల్ ట్రైన్స్ ను రైల్వే శాఖ స్టార్ట్ చేసిందన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్రారంభించని కారణంగా సిటీతోపాటు, శివారు ప్రాంత ప్రజలు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్
ఇబ్బంది పడుతున్నారన్నారు. 50 కిలోమీటర్ల నెట్ వర్క్ తో నిత్యం 121 ట్రిప్పులు నడిచే ఎంఎంటీఎస్ గత ఏడాది మార్చి నుంచి ఆగినట్ట కిషన్ రెడ్డి తెలిపారు.