ప్రజల కోసమే కంటోన్మెంట్​రోడ్లు తెరిచినం: కిషన్​రెడ్డి

ప్రజల కోసమే కంటోన్మెంట్​రోడ్లు తెరిచినం: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ప్రజల సౌకర్యం కోసమే కంటోన్మెంట్​లోని ఐదు రోడ్లను కేంద్ర ప్రభుత్వం ఓపెన్​ చేసిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.  ప్రజల కోసం రోడ్లను తెరిపించినందుకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు ట్విటర్​లో ఆయన కృతజ్ఞతలు తెలిపారు.​ ఆ ప్రాంతంలోని ప్రజల రాకపోకలకు అనువుగా ఈ రోడ్లను తెరవాలని తాను పలుమార్లు రాజ్​నాథ్​సింగ్​కు విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన సమ్మతించారని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ప్రజల సౌలభ్యం రెండు సున్నితమై న అంశాలని, వాటిపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూర్చొని చర్చించుకుంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన సూచించారు. రోడ్లను క్లోజ్​చేసినందుకు కంటోన్మెంట్​కు నీళ్లు, కరెంట్  సరఫరా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిందని, దీనిపైనా రక్షణ మంత్రికి వివరించానన్నారు.