హైదరాబాద్, వెలుగు : ప్రజల సౌకర్యం కోసమే కంటోన్మెంట్లోని ఐదు రోడ్లను కేంద్ర ప్రభుత్వం ఓపెన్ చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రజల కోసం రోడ్లను తెరిపించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు ట్విటర్లో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజల రాకపోకలకు అనువుగా ఈ రోడ్లను తెరవాలని తాను పలుమార్లు రాజ్నాథ్సింగ్కు విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన సమ్మతించారని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ప్రజల సౌలభ్యం రెండు సున్నితమై న అంశాలని, వాటిపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూర్చొని చర్చించుకుంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన సూచించారు. రోడ్లను క్లోజ్చేసినందుకు కంటోన్మెంట్కు నీళ్లు, కరెంట్ సరఫరా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిందని, దీనిపైనా రక్షణ మంత్రికి వివరించానన్నారు.