నిజాం ఆలోచనలతో కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. TRS నేతలు ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. గోదావరి నీళ్లను కేసీఆర్ తన ఫామ్ హౌజ్ కు ఎత్తి పోసుకుంటున్నారని విమర్శించారు. బండిసంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా లింగన్ వాయి గ్రామంలో మీటింగ్ లో మాట్లాడారు నేతలు. ఎన్నికలుంటేనే ప్రజలు, హామీలు గుర్తొస్తాయని బండి సంజయ్ అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి సీఎం ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. కరెంట్ కోతలు పెట్టి.. ఫ్రీ కరెంట్ హామీని గాలికి వదిలేశారని బీజేపీ నేతలు విమర్శించారు.
మరిన్ని వార్తల కోసం