గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్పరిధిలోని యైటింక్లయిన్ కాలనీలోని పోతన కాలనీ 83వ బ్లాక్ లోని ఓ ఇంట్లో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వకీల్పల్లి గనిలో పనిచేస్తున్న యాదవనేని వసంత్ ఆదివారం తన ఇంట్లో ఉండగా లీకేజీ కారణంగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
ఈ ఘటనలో వసంత్తో పాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. క్వార్టర్లోని మరో గదిలో ఉన్న వారి ఇద్దరు పిల్లలను స్థానికులు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. టూటౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల వద్ద వివరాలు సేకరించి విచారణ చేపట్టామని తెలిపారు.
