సత్యదేవుని దర్శించుకొన్న కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి

సత్యదేవుని దర్శించుకొన్న కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి

మంచిర్యాల జిల్లా: కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి ఇవాళ దండేపల్లి మండలం గూడెం సత్యదేవుని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ.. ఏర్పాట్ల పర్యవేక్షణ తదితర కార్యక్రమాల నిమిత్తం ఆమె జిల్లాలో పర్యటిస్తున్నారు. గూడెం వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనాలు అందించారు వేదపండితులు. మంత్రి వెంట జిల్లా బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు ఉన్నారు.