మునుగోడులో గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తుండు : ప్రహ్లాద్ జోషి

మునుగోడులో గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తుండు : ప్రహ్లాద్ జోషి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. నడ్డాకు సమాధి కట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ పేరును బీఆర్ఎస్ గా కాకుండా తెలంగాణ రావు సమితిగా పేరు మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ఉద్దేశం ఏమిటో మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పకనే చెప్పారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ వందల‌ కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా తన కుటుంబం కోసమే మాత్రమే కేసీఆర్ పనిచేస్తున్నట్లు జోషి మండిపడ్డారు. కేసీఆర్ కారణంగా దేశంలోనే అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు లొంగిపోయాయని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఉదయం దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మలక్ పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆఫీసులో మాజీ ఎంపీ నల్లు ఇంద్రసేనా రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. సాయంత్రం కరోనాతో మృతి చెందిన ఆర్ఎస్ఎస్ సభ్యులు శ్రీహరి రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం నాంపల్లి స్టేషన్ ను సందర్శించి 7 గంటలకు గన్ ఫౌండ్రీలో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు.