
బెంగాల్ లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్. 2019 ఎన్నికల్లో 2014 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. మోడీ పాలనకు ప్రజలు పూర్తి మద్దతిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ సరిగ్గా పని చేయకపోతే 2019 ఎన్నికల్లో అంత మెజార్టీ వచ్చేది కాదన్నారు. బెంగాల్ లో గెలిచన ఎమ్మెల్యేలే సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని, బీజేపీ ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా నడుస్తుందన్నారు. భద్రత లోపల కారణంగానే మమతపై దాడి జరిగిందని విచారణ సంస్థలు తెలిపాయన్నారు. నిరాశతోనే బీజేపీపై మమత విమర్శలు చేస్తోందన్నారు రాజ్ నాథ్.