టీఆర్ఎస్‌కి ప్రజలంటే భయం లేదు.. కానీ ఎంఐఎం అంటే భయం

టీఆర్ఎస్‌కి ప్రజలంటే భయం లేదు.. కానీ ఎంఐఎం అంటే భయం

సిద్దిపేట: టీఆర్ఎస్‌ నాయకులకు ప్రజలంటే భయం లేదు కానీ, ఎంఐఎం అంటే మాత్రం భయం ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మొదటి దశ నేటితో పూర్తైంది. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

‘తెలంగాణ యువతకు స్టైఫండ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 20 నెలలు అవుతున్నా.. ఇప్పటకీ 3 వేల స్టైఫండ్ లభించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదు?
 టీఆర్ఎస్‌కి ప్రజలంటే భయం లేదు, ఎంఐఎం అంటే భయం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవార్ధం విమోచన దినం నిర్వహించాలి. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఎంఐ చేతుల్లో ఉంటే.. తెలంగాణ అభివృద్ధి పథంలో ఎలా పయనిస్తుంది? తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది. తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించాలంటే.. కమలంతో ప్రయాణించాలి. బండి సంజయ్ యాత్ర మొదటి దశ విజయవంతంగా ముగిసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని స్మృతి ఇరానీ అన్నారు.

For More News..