మాదాపూర్, వెలుగు: చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు దేశవ్యాప్తంగా మేళాలు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి దర్శనా జర్దోష్ తెలిపారు. మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న ఆలిండియా క్రాఫ్ట్ మేళాను మంగళవారం రాత్రి ఆమె సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు.
చేనేత కళాకారులతో మాట్లాడి వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రాఫ్ట్ మేళాతో చేనేత కళాకారులు వారి వస్తువులను ఈజీగా అమ్ముకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. శిల్పారామం స్పెషల్ అఫీసర్ కిషన్రావు, జనరల్ మేనేజర్ అంజయ్య, క్రాఫ్ట్ మేళా నిర్వాహకులు అరుణ్కుమార్ పాల్గొన్నారు.

