విజయవాడ: వాహనాలకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

విజయవాడ: వాహనాలకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు.ఇంటి బయట పార్క్  చేసిన వాహనాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానిక శ్రీనగర్ కాలనీలో బిల్డర్ శివశంకర్ కు చెందిన కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతకులు కారుపై పెట్రోల్  పోసి నిప్పంటించారు. శివశంకర్  ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సింగ్ నగర్  శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకులు రెండు పూర్తిగా తగలబడిపోగా, కారు ముందు భాగం కాలిపోయింది. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.