బాలయ్య షోకు గెస్టులకు విశ్వక్ సేన్, సిద్ధూ

బాలయ్య షోకు గెస్టులకు విశ్వక్ సేన్, సిద్ధూ

అన్స్టాపబుల్ షో తో బాలయ్య అదరగొడుతున్నాడు. ఇప్పటికే సెకండ్ సీజన్ ప్రారంభమవ్వగా..ఫస్ట్ ఎపిసోడ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ గెస్టులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్  కేవలం 24 గంటల్లో 10 లక్షలకు  పైగా వ్యూస్ సాధించింది.  దీంతో  రెండో ఎపిసోడ్ పై అందరి దృష్టి నెలకొంది. రెండో ఎపిసోడ్కు గెస్టులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధూ జొన్నల గడ్డ, విశ్వక్ సేన్లు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ రిలీజ్ చేసింది. యంగ్ హీరోలతో బాలయ్య సందడి చేశారు. పంచ్లు, సెటైర్లు అదిరిపోయాయి. ’నా మనస్సుకు నచ్చిన కుర్రాళ్లను మీ ముందుకు తీసుకొస్తున్నాను’ బాలకృష్ణ చెప్పడం.. వెంటనే సిద్ధూ, విశ్వక్ సేన్ లు ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమో స్టార్ట్ అయ్యింది.

ఒకడేమో మాస్ కా దాస్, ఒకడేమో మాస్ కా బాస్.. నేనేమో ‘గాడ్ ఆఫ్ మాస్’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్కు అదుర్స్ అనిపించేలా ఉంది. ఎపిసోడ్ చివరిలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎంట్రీ ఇచ్చారు. త్రివిక్రమ్ బయట సినిమాలు చేయడా అని బాలయ్య ప్రశ్నించగా.... ఆయన బయటకు వెళ్లడం తమకిష్టం లేదని నాగవంశీ సమాధానం చెప్పారు. అనంతరం త్రివిక్రమ్ తో బాలయ్య ఫోన్ లో మాట్లాడారు. షోకు ఎప్పుడు వస్తావని బాలయ్య అడగగా.. మీరు ఎప్పుడు ఒకే అంటే అప్పుడు వస్తానంటూ త్రివిక్రమ్ చెప్పారు. ఎవరితో రావాలో తెలుసుగా అంటూ బాలయ్య అనడంతో..అది పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే అన్నారని అర్ధమవుతుంది. సెకండ్ ఎపిసోడ్ ఈ శుక్రవారం టెలికాస్ట్ కానుంది.