ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఇండస్ట్రియల్ఏరియాలో దారి దోపిడీ జరిగింది. బిహార్కు చెందిన నిత్యానంద్ సింగ్, అతని స్నేహితుడు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని జెర్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నడుచుకుంటూ డ్యూటీకి వెళ్తున్న వీరిద్దరిని ఐజీఎం సిమెంట్ కంపెనీ సమీపంలో ముగ్గురు దుండగులు ఒక్కసారిగా బైక్పై వచ్చి చుట్టుముట్టారు.
బాధితులను బెదిరించి వారి వద్ద ఉన్న రూ. 1,800 నగదును లాక్కొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

