మేడిపల్లి, వెలుగు: నారపల్లి ప్రాంతంలో ఉప్పల్ ఎస్వోటీ పోలీసులు బుధవారం నిర్వహించిన ఆకస్మిక దాడిలో డేట్, లేబుల్ లేని సుమారు 600 కిలోల పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లు, రెండు ఆటోలు, రెండు వెయింగ్ మిషన్లను కూడా సీజ్ చేశారు.
పనీర్ను అక్రమంగా నిల్వ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ పనీర్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి సరఫరా చేయాలనుకున్నారు, మరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
