
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊర్వశివో..రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, ఎం.విజయ్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. చీఫ్ గెస్ట్గా హాజరైన బాలకృష్ణ ట్రైలర్తో పాటు ఫస్ట్ టికెట్ను లాంచ్ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ‘యువ దర్శకులంతా కొత్త ఒరవడితో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఈ సినిమా కూడా అలా ట్రెండ్కు తగ్గట్టుగా ఉండబోతోంది. ట్రైలర్ చూస్తుంటే అన్ని రకాల కమర్షియల్ హంగులతో కలర్ఫుల్గా ఉంది. శిరీష్ పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించాడు. అను ఇమ్మాన్యుయేల్లో అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్ కనిపిస్తోంది. దర్శకుడు అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ రాబట్టాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభించాలని టీమ్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా’ అన్నారు. శిరీష్ మాట్లాడుతూ ‘ నాన్నతో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలు చేశాను. ముచ్చటగా మూడో సినిమా కూడా హిట్ అవ్వాలని ఆశిస్తున్నా. అను ఇమ్మాన్యుయేల్ అందాన్ని గత చిత్రాల్లో చూశాం. తనలోని ఆర్టిస్ట్ని ఇందులో చూస్తారు.
‘సార్.. మేడమ్ సార్ మేడమ్ అంతే’ అన్నట్టుగా ఇందులో తన క్యారెక్టర్ ఉంటుంది. నా కోసమే కాదు తన కోసం ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బాలకృష్ణ గారు ఈ ఈవెంట్కి రావడం సంతోషంగా ఉంది’ అన్నాడు. ‘ఇంత కంఫర్ట్గా నేను ఏ సినిమా చేయలేదు. శిరీష్ లవ్లీ కోస్టార్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు నచ్చుతుంది’ అంది అను ఇమ్మాన్యుయేల్. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘శిరీష్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. రాకేష్ చాలా బాగా తీశాడు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన శిరీష్ని మిడిల్ క్లాస్ బాయ్గా చూపించడమే చాలెంజ్. ప్రస్తుతం యూత్ ఫేస్ చేస్తున్న సమస్యల్లో నుంచి పుట్టిన సినిమానే ఇది’ అని చెప్పారు. రాకేష్ మాట్లాడుతూ ‘శిరీష్, అను కారణంగా సినిమా మేకింగ్ చాలా స్మూత్గా జరిగింది. శిరీష్తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది’ అన్నాడు. దర్శకులు మారుతి, పరశురామ్, చందు మొండేటి, వశిష్ట, వెంకటేష్ మహా, సాయి రాజేష్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి, లిరిసిస్టులు కాసర్ల శ్యామ్, పూర్ణాచారి కార్యక్రమంలో పాల్గొన్నారు.