
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికాలో భారీ ఎత్తున వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఫైజర్-బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విస్తృత వినియోగానికి ప్రభుత్వ నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) అగ్రిమెంట్ లభించిన వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది.
16 ఏళ్లు ఆపైన వయసున్న వారితోపాటు పెద్దలకు అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని.. సమర్థవంతమైనదని 174 ఓట్ల తేడాతో నిపుణల కమిటీ ఆమోదం తెలిపింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 3 వేల కరోనా మరణాలు నమోదవుతున్న సమయంలో ఫైజర్-బయోఎన్టెక్ టీకాకు ఆమోదం లభించడం మంచి పరిణామంగా చెబుతున్నారు. దీన్ని రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నాటికి రెండున్నర కోట్ల డోసులను అందిస్తామని ఫైజర్ తెలిపింది. మొదటి దశలో వైద్యారోగ్య, నర్సింగ్హోం, ఇతర అత్యవసర సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు.