పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

పోలీసులు కాంగ్రెస్ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైని కలిసి  పోలీసులు తీరుపై ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియాతో మట్లాడిన ఉత్తమ్. రాష్ట్రంలో ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ సభలకు అనుమతిచ్చిన పోలీసులు కాంగ్రెస్ సభకు  అనుమతివ్వకపోవడంపై ఫిర్యాదు చేశామన్నారు. సీపీ అంజన్ కుమార్ ఏపీ క్యాడర్ అధికారి అయినా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అంజన్ కుమార్ పై అవినీతి ఆరోపణలున్నాయని..వాటిపై విచారణ జరపాలని గవర్నర్ ను కోరామన్నారు. కేసీఆర్ పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని అన్నారు.