ఎల్లుండి ఉత్తరాఖండ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో అడ్డదారుల్లో కొండలు, గుట్టలు ఎక్కుతూ పోలింగ్ స్టేషన్ కు వెళ్తున్నారు. ఎన్నికల సామాగ్రినిని మోసుకుంటూ అతి కష్టం మీద గ్రామాలకు చేరుకుంటున్నారు.
Uttarakhand | Poll parties brave severe weather conditions to reach their designated polling stations ahead of February 14 Assembly elections
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 13, 2022
(Photo credit: Chief Electoral Officer, Uttarakhand.) pic.twitter.com/ghF1TPY2ka
మరిన్ని వార్తల కోసం