వాడపల్లి పుణ్య క్షేత్రం..శివుడి తలపై బిలం

వాడపల్లి  పుణ్య క్షేత్రం..శివుడి తలపై బిలం

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ తాలూకా దామరచర్ల మండలంలోఉంది వాడపల్లి క్షేత్రం.ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాడపల్లిని ‘వజీరాబాదు’అని పిలుస్తారు. పూర్వం తీరప్రాంతంలో పడవలు నడిపేవాళ్లు నిర్మించుకున్న‘వాడపల్లె’ కాలక్రమేణ‘వాడపల్లి’గా మారింది. ఈ గ్రామం కృష్ణా, మూసీ నదులసంగమ ప్రదేశంలో ఉంది.12వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి ‘మీనాక్షీ అగస్తేశ్వర స్వామి’ మందిరం ఇక్కడుంది. అంతేకాదుకృష్ణా నదికి 120 మీటర్లఎత్తులో ఉన్న శివలింగంచాలా ప్రత్యేకం.

దామరచెర్ల, వెలుగు కృష్ణా , మూసీ నదుల సంగమ తీరంలోనివాడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి,శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువై ఉన్నారు. జిల్లాలో అద్దంకి జాతీయ రహదారి సమీపంలోని భీమవరం మీదుగా వాడపల్లికి చేరుకోవచ్చు.ఆరువేల సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని తీర్థయాత్రలు చేస్తూ ఈప్రాంతానికి వచ్చాడని స్థల పురాణం. ఈప్రాంతంలో కృష్ణా , మూసీ(ముచికుందా)నదుల సంగమంలో స్నానం చేసి ఇక్కడే శివలింగంతో పాటు లక్ష్మీ నరసింహ స్వామివిగ్రహం ప్రతిష్ఠించారు. అయితే, రక్షణలేకపోవడంతో కొంతకాలానికి విగ్రహాలచుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి.

మరో కథనం

ఒక రోజు బోయవాడు పక్షిని కొట్టబోతే.. ఆపక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే..శివుడు నిరాకరించాడట. ‘నాకు ఆకలిగా ఉంది’ అని బోయవాడు శివుడితో చెప్పడంతో తన తల నుంచి కొంత మాంసం తీసుకోమని స్వామి చెప్పాడట. దీంతో బోయవాడు తనచేతులతో స్వామి తల నుంచి మాంసం తీసుకున్నాడట. ఆ వేళ్ల గుర్తులు శివలింగంపై ఇప్పటికీ కనబడటం విశేషం. స్వామి శిరస్సున ఏర్పడిన గాయాన్ని కడగడానికి గంగమ్మ వచ్చిందట. అందుకే బోయవాడు మాంసం తీయగా ఏర్పడిన గుంత నుంచి ఎప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. క్రీస్తుశకం 1524వ సంవత్సరంలో శిష్యులతో కలిసి శ్రీశంకరా చార్యులు వాడపల్లి క్షేత్రాన్నిదర్శించా రు. అక్కడ శివుడి తలపై ఉన్న బిలంలోతు తెలుసుకోవాలనుకున్నారు. దీంతో ఒకఉద్దరిణికి తాడు కట్టి బిలంలోకి వదిలారు.అయితే, తాడు లోపలికి వెళ్తూనే ఉంది తప్పబిలం లోతు తెలియలేదు. దీంతో ‘నిన్నుపరీక్షించటానికి నేనెంత వాడను.. క్షమించుస్వామి’ అని వేడుకున్న శంకరాచార్యులు శివుడికి పూజలు చేసి అక్కడి నదులసంగమంలో పుణ్యస్నానం చేశారట. ఈ విషయాన్ని శంకరాచార్యులవారు రాయిం చినశాసనం(పాళీ భాషలో)లో ఉంది. ఈ శాసనంఆలయంలో ఇప్పటికీ కనిపిస్తుం ది. శాసనంప్రకారం చాలా మంది ఇక్కడి కృష్ణా , మూసీనదుల సంగమం ప్రాంతంలో అస్తికలనిమజ్జనం, కర్మకాం డలు చేస్తుంటారు.

రెడ్డి రాజుల పరిపాలన కాలంలో..

రెడ్డిరాజుల పరిపాలన కాలంలో వాడపల్లిప్రాంతంలో రెండు వైపులా నీళ్లు, ఒక వైపుదారి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రదేశంలో కోటతో పాటు ఇళ్లు కట్టుకుంటే సురక్షితంగాఉంటాయని భావించా రు. దీంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన పాలకులకు శివలింగం కనిపిం చడంతో ఆలయంకట్టించారు. నాడు చాలా ప్రసిద్ధి పొందిన ఈప్రాంతాన్ని అగస్త్యపురము, నర్సింహపురం,వీరభద్రపురం.. పేర్లతో పిలిచేవాళ్లు. నాటి రెడ్డిరాజులు కట్టిం చిన నిర్మాణాలు ఇప్పటికీచెక్కు చెదరకుండా ఉండటం విశేషం. కాగా,పదకొం డు వందల ఏళ్లు సురక్షితంగా ఉన్నఈ పట్టణం నిజాం మేనల్లుడు వజీర్ సుల్తాన్ముట్టడితో నాశనమైంది. అయితే, వజీర్సుల్తాన్ ఇక్కడి ఆలయాలకు ఎలాం టి నష్టంకలిగిం చలేదు.

చారిత్రక సాక్ష్యాలు

అగస్తేశ్వరాలయం తూర్పు దిక్కుగా,సంగమాభి ముఖంగా ఉంటుంది.ఆలయంలోని శివుడి పానవట్టం ఎత్తుగా ఉంటుంది. దాని మీద లింగం మరో రెండుఅడుగుల ఎత్తులో ఉంటుంది. లింగానికి వెండి కళ్లు, వాటి పైన వెండి నాగు పాము పడగకనిపిస్తాయి. లింగం మీదున్న చిన్న గుంతనుంచి అన్ని కాలాల్లో నీళ్లు ఊరుతుంటాయి.ఈ ఆలయంలో ఉండే ఒక దండం లాంటివస్తువుతో పూజారి భక్తుల వీపు మీద కొడతారు.దుష్టగ్రహ నివారణ కోసమే అలా చేస్తారనిభక్తులు చెబుతారు. వాడపల్లికి నరసింహస్వామి ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది.