Gujarath floods: గుజరాత్లో భారీ వరదలు..బ్రతకడానికి ఏమీ మిగల్లేదంటూ ఆవేదన

Gujarath floods: గుజరాత్లో భారీ వరదలు..బ్రతకడానికి ఏమీ మిగల్లేదంటూ ఆవేదన

గుజరాత్ లో గత నాలుగు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం15 మంది చనిపోయారు. గాంధీనగర్, ఖేడా, వడోదరలో గోడ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆనంద్ జిల్లాలో చెట్టు మీదపడి ఒకరు, నీటిలో మునిగి మరో ఇద్దరు మరణించారు. భారీ వానలకు నదులు, వాగులు, డ్యామ్ లు నిండిపోయాయి.లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవితం అస్తవ్యస్తమైంది.

 వరద ఉదృతికి మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయని వడోదరలోని  ఓవ్యక్తి  రెడ్డిట్ యాప్ లో   తన ఆవేదన పంచుకున్నాడు. నీళ్లల్లో మునిగిపోయిన కార్ల ఫోటోలను పోస్టూ చేస్తూ ఇక బ్రతకడానికి  ఏమి లేదని.. తన మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

వీధిలో పార్క్ చేయడం వల్లే ఇలా జరగిందన్న కామెంట్స్ కు కూడా అతను రిప్లై ఇచ్చాడు. నేను 5 BHK బంగ్లాలో ఉంటాను. 85 ఇళ్లు ఉన్న సొసైటీలో. మాకు ప్రతి ఇంటికి 3 కార్ పార్కింగ్‌లు ఉన్నాయి. నా ఇంట్లోకి ఇప్పటికి 7 అంగుళాలు..  నా ఇంటి బయట దాదాపు 4 అడుగుల నీరు చేరింది. నేనేమి  చేయగలను? చుట్టుపక్కల ప్రాంతాలన్నీ  నీట మునిగాయని తెలిపాడు.