- రేపటి నుంచి స్టార్ట్: వంశీచంద్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పాలమూరు అభివృద్ధి కోసం కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు న్యాయ్ యాత్రను చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని బుధవారం నుంచి యాత్రను మొదలు పెట్టనున్నారు. మహబూబ్నగర్పార్లమెంట్నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
బుధవారం ఉదయం 10 గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ గ్రామంలో ఉన్న క్షీర లింగేశ్వర స్వామి మఠం నుంచి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి దామోదర రాజనర్సింహ సమక్షంలోఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.