పాలమూరు అభివృద్ధి కోసం న్యాయ్ యాత్ర : వంశీచంద్​ రెడ్డి

పాలమూరు అభివృద్ధి కోసం న్యాయ్ యాత్ర : వంశీచంద్​ రెడ్డి
  • రేపటి నుంచి స్టార్ట్​: వంశీచంద్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పాలమూరు అభివృద్ధి కోసం కాంగ్రెస్ ​నేత చల్లా వంశీచంద్​ రెడ్డి పాలమూరు న్యాయ్​ యాత్రను చేపట్టనున్నారు. రాహుల్​ గాంధీ న్యాయ్ ​యాత్రను స్ఫూర్తిగా తీసుకుని బుధవారం నుంచి యాత్రను మొదలు పెట్టనున్నారు. మహబూబ్​నగర్​పార్లమెంట్​నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

బుధవారం ఉదయం 10 గంటలకు మక్తల్​ నియోజకవర్గంలోని కృష్ణ గ్రామంలో ఉన్న క్షీర లింగేశ్వర స్వామి మఠం నుంచి మహబూబ్​నగర్​ జిల్లా కాంగ్రెస్​ ఇన్​చార్జి దామోదర రాజనర్సింహ సమక్షంలోఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మహబూబ్​నగర్​ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.