సూర్యాపేటలోనే నాణ్యమైన ఆర్కిటెక్చర్ సేవలు

సూర్యాపేటలోనే నాణ్యమైన ఆర్కిటెక్చర్ సేవలు

సూర్యాపేట, వెలుగు : ఇల్లు నిర్మించేటప్పుడు నూతన టెక్నాలజీ, ఆధునిక డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తప్పనిసరి అవుతున్నాయని, ఇప్పుడు హైదరాబాద్​కు వెళ్లకుండానే సూర్యాపేటలోనే నాణ్యమైన ఆర్కిటెక్చర్ సేవలు పొందవచ్చని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ గుణగంటి వంశీ స్థాపించిన వంశీ బిల్డింగ్ డిజైనర్స్ అండ్ ప్లానర్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇండ్ల నిర్మాణాల్లో నూతన ఆవిష్కరణలు మొదలైన తరుణంలో సౌందర్యంతోపాటు టెక్నాలజీ సమ్మేళనంతో కూడిన డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇప్పుడు జిల్లా కేంద్రంలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇంటి నిర్మాణాల్లో నూతన ఆవిష్కరణలు అవసరమని, ఈ దిశగా ఆర్కిటెక్చర్ డిజైన్స్ కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. పట్టణ వాస్తవిక అవసరాలను తెలుసుకొని నాణ్యతతో కూడిన నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, మాజీ కౌన్సిలర్లు రాములు, ఎండీ షఫీ ఉల్లా, రమేశ్, కార్తీక్, సురేశ్ రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.