
ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురం ఇన్స్ పెక్టర్ సీహెచ్.శ్రీనివాసరావుపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. గతేడాది అక్టోబర్ లోనే ఆయన చార్జ్ తీసుకున్నారు. ఏడాది తిరగకుండానే బదిలీ అవడానికి అవినీతి ఆరోపణలే కారణమని సమాచారం.
ఓ ల్యాండ్ వివాదంలో తలదూర్చినట్లు, గతంలో చార్జ్ మెమో తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఇన్స్పెక్టర్ ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలున్నాయి.