
హ్యాపీడేస్ చిత్రంతో పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్(Varunsandesh)..తర్వాత కెరీర్లో సక్సెస్లు అందుకోలేక పోయాడు. ఇటీవల మైఖేల్ మూవీతో తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేసిన వరుణ్..ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం వరుణ్ చిత్రం చూడర (Chitramchudara) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో వరుణ్ సందేశ్ తో పాటు, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ , రవిబాబు కనిపిస్తున్నారు. ఓ రాత్రి పూట ఓ వాల్ హౌస్పై కూర్చొని ఉండటంతో టీజర్ మొదలవ్వగా..ఏదో దొంగతనం చేయబోతున్నట్లు చూపించారు.
ఇందులో వరుణ్ సందేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్గా కనిపిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఇక వరుణ్ చేయబోయే క్రైమ్లో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ క్రైమ్ పార్ట్నర్స్గా నటించగా..అసలు పాయింట్ ఏంటనేది డైరెక్టర్ టీజర్ లో చూపించలేదు. టీజర్ మొత్తం సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్తోనే కట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఆడియాన్స్ లో క్యూరియాసిటీని కలిగించేలా కట్ చేసిన టీజర్ వరుణ్ కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతోందనే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
టీజర్ లో వరుణ్ డైలాగ్ చెబుతూ..'లెక్కున్నోడు లేట్ నైట్ అయినా పవర్ స్టార్ అనే అంటాడు.. తిక్కున్నోడు ఎప్పుడూ తీన్ మార్ కిక్లోనే ఉంటాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ మూవీలో నేనింతే మూవీ ఫేమ్ అతిథి గౌతమ్ ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ చేస్తోంది.
వరుణ్ సందేశ్ చిత్రం చూడర సినిమా పైనే ఆశలన్నీపెట్టుకున్నట్లు సమాచారం. మరి వరుణ్ ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి. ఈ సినిమాను బి ఎం సినిమాస్ బ్యానర్ లో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాధన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా చిత్రంలో రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, రచ్చ రవి, కేఏ పాల్ రాము, రైజింగ్ రాజు తదితరులు తెరపై కనిపించనున్నారు