వాషింగ్టన్: మణిపూర్ ఘటన తమను షాక్కు గురిచేసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. మంగళవారం ఆయన వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపూర్ ఘటనపై పాకిస్తాన్ రిపోర్టర్ ప్రశ్నించగా స్పందించారు. ‘‘మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ కొట్టిన వీడియో తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. బాధితులకు సానుభూతి తెలియజేస్తున్నం.
వాళ్లకు న్యాయం చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలుపుతున్నం” అని వేదాంత్ పటేల్ చెప్పారు. ‘‘మణిపూర్లో హింసకు ముగింపు పలకాలంటే శాంతి నెలకొల్పాలి. అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలి. అన్ని వర్గాల ప్రజలను కాపాడాలి” అని సూచించారు. మహిళలపై ఇలాంటి దారుణాలు జరగడం.. ఏ దేశానికైనా సిగ్గుచేటని మోదీ పేర్కొన్నారని గుర్తుచేశారు.