మణిపూర్ ఘటనతో షాక్ అయినం

మణిపూర్ ఘటనతో షాక్ అయినం

వాషింగ్టన్: మణిపూర్ ఘటన తమను షాక్​కు గురిచేసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. మంగళవారం ఆయన వాషింగ్టన్​లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపూర్ ఘటనపై పాకిస్తాన్ రిపోర్టర్ ప్రశ్నించగా స్పందించారు. ‘‘మణిపూర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ కొట్టిన వీడియో తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. బాధితులకు సానుభూతి తెలియజేస్తున్నం. 

వాళ్లకు న్యాయం చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలుపుతున్నం” అని వేదాంత్ పటేల్ చెప్పారు. ‘‘మణిపూర్​లో హింసకు ముగింపు పలకాలంటే శాంతి నెలకొల్పాలి. అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలి. అన్ని వర్గాల ప్రజలను కాపాడాలి” అని సూచించారు. మహిళలపై ఇలాంటి దారుణాలు జరగడం.. ఏ దేశానికైనా సిగ్గుచేటని మోదీ పేర్కొన్నారని గుర్తుచేశారు.