
హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. ఈ నెల 23వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'కలవరమే కలిగేనే కలలాంటి కథలోన' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకు రాంబాబు సాహిత్యాన్ని అందించగా, శ్రీనిష ఆలపించింది.
శ్రీ విష్ణు ఎప్పటిలాగానే ఈ సారి కూడా విభిన్న కథతో ప్రేక్షకులను మెప్పించడానికి చేయడానికి వస్తున్నాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ మూవీకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. మొదటిసారిగా పోలీస్ రోల్లో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాతో కయ్యదు లోహర్ కొత్త కథానాయిక పరిచయమవుతోంది. తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, రాజా రవీంద్ర నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరామెన్ : రాజ్ తోట