‘వెలుగు’ ఎఫెక్ట్.. రైతుకు పెన్షన్ పైసలు అందినై

‘వెలుగు’ ఎఫెక్ట్.. రైతుకు పెన్షన్ పైసలు అందినై

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజయ్య అనే రైతుకు పెన్షన్ పైసలు ఇచ్చారు బ్యాంకు అధికారులు. వివరాల్లోకి వెళితే.. రాజయ్య  బ్యాంకుకు క్రాప్ లోన్ బాకీపడ్డాడు. అయితే గతంలోనే క్రాప్ లోన్ మాఫీ అయిందన్న బ్యాంకు అధికారులు ఇప్పుడు కట్టాల్సిందేనని పట్టుబట్టారు.. దీంతో  అతనికి వచ్చే పెన్షన్ ను నిలిపివేశారు బ్యాంకు అధికారులు.

రాజయ్య కొన్ని రోజులుగా.. అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. పెన్షన్ రాకపోవడంతో వైద్యం చేయించుకోడానికి కూడా పైసలు లేవు. ఈ విషయం ‘వెలుగు’ దృష్టికి వచ్చింది. దీంతో ‘వెలుగు’ తన పేపర్, వెబ్ సైట్ ద్వారా రాజయ్య బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కదిలిన అధికారులు ఈ రోజు రాజయ్యకు పెన్షన్ పైసలు ఇచ్చారు. ఇందుకు గాను రాజయ్య ‘వెలుగు’కు కృతజ్ఞతలు తెలిపారు.

పెన్షన్ లాక్కుంటున్న బ్యాంకు