ఎములాడ రాజన్న ఆలయానికి వారం రోజుల్లో.. రూ.1.46 కోట్ల ఆదాయం

ఎములాడ రాజన్న ఆలయానికి వారం రోజుల్లో.. రూ.1.46 కోట్ల  ఆదాయం

వేములవాడ, వెలుగు :  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భారీ అదాయం సమకూరింది. భక్తులు వివిధ రూపాల్లో హుండీల్లో సమర్పించిన కానుకలను ఆలయ ఓపెన్​ స్లాబ్​ లో బుధవారం లెక్కించారు.

ఏడు రోజుల్లో రూ.కోటి 46 లక్షల 79 వేల నగదు,  54 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి వచ్చిందని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో ఈవో కృష్ణ ప్రసాద్, ఏఈవోలు, ఉద్యోగులు, శివరామకృష్ణ భజన మండలి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.