హైదరాబాద్ లోని HICCలో ఆక్వా ఆక్వేరియా ఇండియా – 2019 సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సదస్సులో ఆసియా దేశాల నుంచి 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రొయ్యల పెంపకంపైనా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
