
- ఇప్పటికే రూ.20 కోట్ల మందును డంప్ చేశారు
- ఈ వ్యవహారాన్నంతా ఓ ప్రొడ్యూసర్ చూస్తున్నడు
- త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతా
- బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో అధికార బీఆర్ఎస్ రూ.250 కోట్ల విలువైన మద్యాన్ని పంచేందుకు యత్నిస్తోందని, ఇప్పటికే రూ.20 కోట్ల మందును డంప్చేశారని కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓ సినీ నిర్మాత ఈ వ్యవహారాన్ని చూస్తున్నారన్నారని, త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతానని చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ప్రజలు సీఎం కేసీఆర్కు శాశ్వతంగా రాజకీయ వీడ్కోలు పలుకుతారన్నారు. గజ్వేల్లో ఓటమి భయంతోనే సీఎం కామారెడ్డిలో పోటీకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో ఓ వర్గం ఓట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఇక్కడి ఓ నేత సహకరిస్తున్నారన్నారు.
హైదరాబాద్నుంచి ఓ వర్గం వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాగునీటి పైపులైన్కోసం రూ.195 కోట్లు కేటాయించగానే సంబురాలు చేస్తున్న స్థానిక బీఆర్ఎస్లీడర్లు, ఇన్నాళ్లుగా ఫండ్స్ఎందకివ్వలేదో ఆలోచించాలన్నారు. రాత్రికి రాత్రే చింతమడకకు కోట్లు కేటాయించారని, కామారెడ్డిలోని 96 గ్రామాలకు ఎన్ని వేల కోట్లు తీసుకొస్తావని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను ప్రశ్నించారు. మాస్టర్ప్లాన్రద్దయిందని అంటూనే కొత్త రోడ్లకు ఫండ్స్శాంక్షన్చేస్తున్నారని, భూములు కోల్పోతున్న రైతులు ఆలోచించాలన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ఆటలు సాగవన్నారు. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్నేతలు గాలికొదిలేశారన్నారు. మున్సిపల్ఫ్లోర్లీడర్శ్రీకాంత్, టౌన్, మండలాల ప్రెసిడెంట్లు విఫుల్జైన్,గంగారెడ్డి పాల్గొన్నారు.