
ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకువచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు సినీ ప్రముఖులు,అభిమానులు వేణుమాధవ్ కు నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం మౌలాలీ స్మశానవాటికలో వేణుమాధవ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.