చంద్రబాబు సర్కార్ కు వంద కోట్ల జరిమానా :విజయమ్మ

చంద్రబాబు సర్కార్ కు వంద కోట్ల జరిమానా :విజయమ్మ

చిత్తూరు:  రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇలా అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ.  చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చంద్రబాబు సర్కారుపై 100 కోట్ల రూపాయల జరిమానా విధించిందని..ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని విమర్శించారు.  వైసీపీ అధికారంలోకి రాగానే.. 108 అంబులెన్స్‌ సేవలను పునరుద్దరించి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తోంది వైసీపేనని అన్నారు. పూతలపట్టు వైసీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి నల్లకొండ గారి రెడ్డప్పలను గెలిపించాలని కోరారు. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి..ప్రత్యేక హోదా సాధించుకుందామని విజయమ్మ ఓటర్లకు పిలుపునిచ్చారు.