చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇలా అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కారుపై 100 కోట్ల రూపాయల జరిమానా విధించిందని..ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. 108 అంబులెన్స్ సేవలను పునరుద్దరించి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తోంది వైసీపేనని అన్నారు. పూతలపట్టు వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి నల్లకొండ గారి రెడ్డప్పలను గెలిపించాలని కోరారు. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి..ప్రత్యేక హోదా సాధించుకుందామని విజయమ్మ ఓటర్లకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు సర్కార్ కు వంద కోట్ల జరిమానా :విజయమ్మ
- ఆంధ్రప్రదేశ్
- April 5, 2019
లేటెస్ట్
- తెలంగాణ డీజీపీ ఫోటో వాడి సైబర్ అటాక్..
- ఒడిశా సీఎం చుట్టూ అవినీతి కోటరీ: మోదీ
- సిటీ శివారులో పోలీస్ మార్చురీ పెట్టాలి : మర్రి శశిధర్ రెడ్డి
- బిజినెస్ గ్రోత్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్
- రాయ్బరేలీలో రాహుల్ పూజలు
- ఉప్పల్ లో దారుణం.. భార్య గొంతు నులిమి చంపిన భర్త
- జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు రూ.57 కోట్లు రిలీజ్
- భాగ్యలక్ష్మి బ్యాంకు లో..
- గుజరాత్లో నలుగురు ఐఎస్ టెర్రరిస్టుల అరెస్ట్
- ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణం కూల్చివేత
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం