కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం ఆడపిల్లలకు రక్షణ ఉండదు

కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం ఆడపిల్లలకు రక్షణ ఉండదు

సైదాబాద్ చిన్నారి ఘటన దురదృష్టకరమన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె.. రేపిస్ట్ రాజు డెడ్ బాడీని బాధిత కుటుంబాలకు చూపించాలన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాధితులను సీఎం ఎందుకు పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ CMగా ఉన్నంత వరకు ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు విజయశాంతి. కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు.ఉదయం వచ్చి డబ్బులిచ్చి నోరుమూయిద్దామనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయన్ని మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.