![ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు : ముగ్గురు ప్రయాణికులు మృతి](https://static.v6velugu.com/uploads/2023/11/vijayawada-bus-stand-platform-bus-incident_5cuTJGbQI1.jpg)
విజయవాడలో దారుణం జరిగింది. బస్ స్టాండ్ లోని ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో కండక్టర్ తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు.
12వ నంబర్ ప్లాట్ఫాం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఈ బస్సుకు.. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : నిజాయతే నా బలం : కడియం శ్రీహరి