క‌న‌క దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా

క‌న‌క దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలుత కేంద్ర రవాణామంత్రి నితిన్‌ గడ్కరీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 4న ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు గడ్కరీ సిద్ధమయ్యారు. అదే సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హఠాన్మరణంతో కేంద్రం సంతాపదినాలు ప్రకటించడంతో ప్రారంభోత్సవం ఈ నెల 18కి వాయిదా పడింది.

అయితే తాజాగా గడ్కరీకి కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో చేసిన ప్రకటనతో ఈ కార్యక్రమం మరోసారి వాయిదా ప‌డింది. కేంద్రమంత్రి గడ్కరీ లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.