ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలుత కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4న ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు గడ్కరీ సిద్ధమయ్యారు. అదే సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హఠాన్మరణంతో కేంద్రం సంతాపదినాలు ప్రకటించడంతో ప్రారంభోత్సవం ఈ నెల 18కి వాయిదా పడింది.
అయితే తాజాగా గడ్కరీకి కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్లో చేసిన ప్రకటనతో ఈ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కేంద్రమంత్రి గడ్కరీ లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.
Yesterday, I was feeling weak and consulted my Doctor. During the course of my check up, I have been tested COVID 19 positive. I am at present doing well with the blessings and good wishes of all. I have isolated myself.
— Nitin Gadkari (@nitin_gadkari) September 16, 2020