రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి

రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి

వనపర్తి, వెలుగు: కొత్తకోటలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని పళిమార్  పీఠాధిపతి విజయేంద్రస్వామి బుధవారం సందర్శించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రంలోని పళిమార్  మఠానికి చెందిన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు భక్తులు సహకరించాలని కోరారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు.

ఆలయ నిర్వాహకులు గండూరి ప్రవీణ్ కుమార్, బాధం వెంకటేశ్, జడ్పీ వైస్  చైర్మన్  వామన్ గౌడ్, మాజీ జడ్పీ టీసీ విశ్వేశ్వర్, కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి, రాములు, యుగంధర్ గౌడ్  పాల్గొన్నారు.