నెలాఖరులోగా సీఎంఆర్​ అందించాలి : తేజస్  నందలాల్​ పవార్

నెలాఖరులోగా సీఎంఆర్​ అందించాలి : తేజస్  నందలాల్​ పవార్

వనపర్తి, వెలుగు: మిల్లర్లు ఈ నెల చివరిలోగా సీఎంఆర్​ను ఎఫ్ సీఐకి అందించాలని కలెక్టర్  తేజస్  నందలాల్​ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​ కాన్ఫరెన్స్  హాల్​లో అడిషనల్  కలెక్టర్  ఎస్  తిరుపతి రావుతో కలిసి రైస్  మిల్  అసోసియేషన్, రైస్  మిల్లర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సీఎంఆర్​ ఇవ్వకుండా ఆలస్యం చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గడువులోగా సీఎంఆర్​ wఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు. మిల్లుల వారీగా 2021 నుంచి ఇప్పటి వరకు కేటాయించిన వడ్లు, వారు ఇచ్చిన సీఎంఆర్​పై రివ్యూ చేశారు. 20 రోజుల్లో బియ్యం ఎలా ఇస్తారనే విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని ఆదేశించారు.