లక్ష ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు

లక్ష ఇచ్చినోళ్లకే  ఇందిరమ్మ ఇండ్లు
  • సోషల్ మీడియాలో మహిళ వీడియో వైరల్

హసన్ పర్తి, వెలుగు: లక్ష రూపాయలు ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారంటూ హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారి అనిత ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడిన వీడియోను గుర్తు తెలియని వ్యక్తి గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. భర్త రాజుతో కలిసి తాను కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నానని వాపోయింది. 

నలుగురు పిల్లలు ఉన్నారని, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. ఇంటి కోసం ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేస్తున్నారని, తన వద్ద రూ.50 వేలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా అప్పు తీసుకొచ్చినట్టు చెప్పింది.